పట్నా : తన వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిన భార్యను దారుణంగా హత్య చేసిన వ్యక్తి ఉదంతం బిహార్లోని సమస్తిపూర్లో వెలుగుచూసింది. సైద్పూర్ జహిద్ గ్రామంలో వివాహిత మృతదేహం కరెంట్ స్తంభానికి వేలాడుతూ కనిపించడం కలకలం రేపింది. గ్రామస్తులు ఈ విషయం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.
మృతురాలిని ఉమాదేవిగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో కట్టుకున్న భర్తే ఆమెను కడతేర్చినట్టు వెల్లడైంది. భర్త పలువురితో వివాహేతర సంబంధాలు కలిగిఉండటంతో నిలదీసినందుకు భార్యను హత్య చేసి కరెంట్ స్తంభానికి వేలాడతీశాడు. తన తల్లిని తండ్రే హత్య చేశాడని బాధితురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.