బంజారాహిల్స్ : సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న ఓ మహిళా టీచర్తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు అశ్లీల ఫోటోలు పంపిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని ఏకే టవర్స్లో నివాసం ఉంటున్న మహిళ (44) సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుండడంతో పాటు టీచర్గా పనిచేస్తుంటారు.
కాగా గత కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఫోన్తో పాటు వాట్సప్ గ్రూపుల్లో అశ్లీల ఫోటోలు పోస్ట్ చేస్తుండంతో పాటు అసభ్యకరమైన రీతిలో దుర్భాషలాడుతున్నారు. అమెతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఇదే విధమైన ఫోటోలు పంపిస్తూ తీవ్రమైన మానసిక వేదనకు కలిగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తనను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు గురువారం బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 354(డి),509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.