Rail Accident in AP | ఆంధ్రప్రదేశ్లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా జీ సిగడాం మండలం బాతువాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కోణార్క్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. టెక్నికల్ సమస్య తలెత్తడంతో బాతువా వద్ద గువాహటి ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో ప్రయాణికులు కొందరు దిగి పక్కనే ఉన్న ట్రాక్పై నిలబడి ఉన్నారు.
ఈ లోగా మరో వైపు నుంచి దూసుకొచ్చిన కోణార్క్ ఎక్స్ప్రెస్ వారిని ఢీ కొడుతూ దూసుకెళ్లింది. దీంతో జీ సిగడాం రైల్వే స్టేషన్ బాధితుల ఆర్తనాదాలతో హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.