శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కిష్టావర్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రయివేటు క్యాబ్ అదుపుతప్పి రోడ్డు పక్కనే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో క్యాబ్లో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. క్యాబ్లో మొత్తం 8 మంది ఉన్నట్లు తెలిపారు. లోయలో పడ్డ క్యాబ్ను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
J&K | Eight people died when a car fell into a deep gorge around 5:30 in the evening in the Marwah area of Kishtwar: Deputy Commissioner Kishtwar
— ANI (@ANI) November 16, 2022