నల్లగొండ : జిల్లాలోని నార్కట్ పల్లి మండలంలోని ఏపీ లింగోటం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..ఏపీ లింగోటం నుంచి గ్రానెట్ లోడ్తో ఓ లారీ 65వ జాతీయ రహదారిపైకి వస్తుంది. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న డీసీఎం వ్యాన్ అతి వేగంగా వస్తూ గ్రానైట్ లారీని ఢీకొట్టింది. దీంతో గ్రానైట్ లారీ డీసీల్ ట్యాంక్ కు డీసీఎం బలంగా తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే వాహనాలు మంటల్లో చిక్కుపోయాయి. పోలీసులు ఇచ్చిన సమాచారంతో నల్గొండ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.
అయినప్పటికి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధం అయినా డ్రైవర్లు సమయస్ఫూర్తితో కిందకు దూకారు. స్వల్ప గాయాలతో బయట పడగా కామినేని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కంగనా పరువాల విందు.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
సిద్ధాపూర్లో గంజాయి మొక్కలు ధ్వంసం
థియేటర్స్లోకి రాబోతున్న మరో రెండు సినిమాలు