బంజారాహిల్స్ : పాతకక్షల కారణంగా వ్యక్తిపై దాడికి పాల్పడిన జూబ్లీహిల్స్ కార్పొరేటర్ సోదరుడితో పాటు అతడి కుటుంబ సభ్యులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఫిలింనగర్లోని భగత్సింగ్ కాలనీలో నివాసం ఉంటున్న గందె అరుణ్కుమార్ అనే బీజేపీ కార్యకర్త బుధవారం రాత్రి జ్ఞానీజైల్ సింగ్నగర్లోని చికెన్ షాపు వద్ద నిలబడి ఉండగా అక్కడకు వచ్చిన కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ సోదరుడు వెల్దండ రమేష్, వెల్దండ అనిల్, రామ్, లక్ష్మణ్ తదితరులు ఆరుణ్కుమార్తో గొడవకు దిగారు.
మాటామాటా పెరగడంతో అరుణ్కుమార్పై దాడి చేశారు. తనపై బీర్బాటిళ్లతో దాడి చేయడంతో తలకు తీవ్రగాయాలయ్యా యని, గతంలో కూడా తనను చంపేస్తానంటూ కార్పొరేటర్ సోదరుడు రమేష్ బెదిరించాడని, వీరివల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితుడు అరుణ్కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు నిందితులపై ఐపీసీ 324,504,506 రెడ్విత్ 34సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.