పాట్నా: ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో బైక్ పార్క్ చేశాడు. బైక్ను అక్కడి నుంచి తీయమని అడిగిన ట్రాఫిక్ పోలీస్పై అతడు దాడి చేశాడు. బీహార్లోని జెహనాబాద్లో ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో బైక్ను నిలిపాడు. ట్రాఫిక్కు అడ్డంగా ఉన్నందున తీయమని ట్రాఫిక్ పోలీస్ చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఆ పోలీస్ను కింద పడేసి కొట్టాడు. అనంతరం బైక్ను అక్కడే వదిలేసి అతడు పారిపోయాడు.
అయితే, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఏఆర్ రాయ్ తెలిపారు. కాగా, ఆ వ్యక్తి ట్రాఫిక్ పోలీస్పై దాడి చేసిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.