బెంగళూరు: ఒక తల్లి తన నాలుగేళ్ల కుమార్తెను బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది. దీంతో ఆ పాప మరణించింది. కర్ణాటక రాజధానిలో ఈ సంఘటన జరిగింది. బెంగళూరు ఎస్ఆర్ నగర్లోని అపార్ట్మెంట్ బిల్డింగ్ నాలుగో అంతస్తు ఫ్లాట్లో ఒక జంట నివసిస్తున్నది. భార్య దంత వైద్యురాలు, భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. వారి నాలుగేళ్ల పాపకు మూగ, చెవిటి వైకల్యం ఉంది. దీంతో ఆ మహిళ తీవ్ర మనస్థాపం చెందింది.
కాగా, గురువారం ఆ మహిళ తన నాలుగేళ్ల కుమార్తెను బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది. అనంతరం ఆమె కూడా అక్కడి నుంచి దూకేందుకు అంచున ఉన్న ఇనుప రైల్స్పైకి ఎక్కింది. గమనించిన పొరుగువారు వెంటనే ఆ మహిళను వెనక్కి లాగారు. మరోవైపు తల్లి విసిరేయడంతో కింద పడిన బాలిక చనిపోయింది.
భర్త ఫిర్యాదుతో భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని, ఆ మహిళ మానసిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. కాగా, మహిళ తన కుమార్తెను బిల్డింగ్ పైనుంచి కిందకు విసిరేసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.
A woman was arrested in #Bengaluru for killing her four-year-old mentally challenged daughter by throwing her from the fourth floor of a building, police said. pic.twitter.com/S96GaVblxx
— IANS (@ians_india) August 5, 2022