హైదరాబాద్ : ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఉస్మానియా దవాఖానకు తరలించారు.
స్థానకుల కథనం మేరకు.. జనుమ్ కాలనీ 3వ బ్లాక్ 22 నంబర్ ఇంటిలో ఉంటున్న జివ్వాజి నర్సింహ (36) వృత్తి రీత్యా ప్లంబర్. తన తల్లిదండ్రులకు ,భార్య కు దూరంగా చాలా రోజుల నుంచి ఒక్కడే నివాసముంటున్నాడు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి తనకి తెలిసిన వారికి, పక్కింటి వారికి ఫోన్ చేసి నాకు చాలా భయంగా ఉంది..ఎవరో నన్ను చంపటానికి వస్తున్నారు అని చెప్పినట్లు తెలుస్తున్నది.
బుధవారం తెల్లవారి చుస్తే బయట నుంచి తాళం పెట్టిన గదిలో రక్తం మడుగులో పడి ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యనా లేక ఆత్మహత్యా ప్రయత్నమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.