మెదక్ : వివాహమైన కొద్ది రోజులకే ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి అదృశ్యమైంది. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నార్సింగి మండల కేంద్రానికి చెందిన ఓ యువతికి ఇటీవలే వివాహమైంది. అయితే ఆమె సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ఆ వివాహిత ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమె ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. ఆర్టీసీ బస్సులో వెళ్లినట్లు గుర్తించారు. రామాయంపేటలో ఓ యువకుడితో బైక్పై వెళ్లినట్లు కూడా ఫుటేజీ లభించింది. అయితే నార్సింగి చెరువు వద్ద ఇరువురి చెప్పులు, బైక్ మంగళవారం ఉదయం కనిపించాయి. దీంతో నార్సింగి చెరువులో గజ ఈతగాళ్లు విస్తృతంగా గాలిస్తున్నారు. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.