పెద్దపల్లి : జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల వద్ద గత నెల 17న హత్యకు గురైన న్యాయవాద దంపతులు వామన రావు, పీవీ నాగమణిల హత్య కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్న ఊదరి లచ్చయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. మంథని ప్రిన్సిపల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జడ్జి నాగేశ్వరరావు ఎదుట పోలీసులు హాజరుపరిచారు. దీంతో ఆయన నిందితుడికి 14 రోజుల జుడిషియల్ రిమాండ్ కు ఆదేశించారు. లచ్చయ్యను పోలీసు కస్టడీలో కరీంనగర్ కేంద్ర కారాగారానికి తరలించారు.
మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన లచ్చయ్య హత్యకు కొన్ని గంటల ముందు మంథనిలో న్యాయవాద దంపతులు కోర్టు వద్ద ఉన్న సమయంలో వారి కదలికలపై రెక్కీ నిర్వహించినట్లుగా గుర్తించి అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
అంగన్వాడీల గౌరవాన్ని పెంచిన టీఆర్ఎస్ ప్రభుత్వం
కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
షాకింగ్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన దళిత బాలిక హత్య!
చికిత్స పొందున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
ప్రయాణాల్లో ఆహార చిట్కాలు