భోపాల్ : పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి యువతి(21)ని అపహరించిన ప్రభుత్వ ఉద్యోగి భోపాల్లోని కోలార్ ప్రాంతంలో ఫాంహౌస్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు అయోధ్యనగర్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది.
తనను నిందితుడు శనివారం కిడ్నాప్ చేసి కోలార్ ప్రాంతంలోని ఓ ఫాంహౌస్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వెల్లడించింది. నిందితుడిని ఏడాది నుంచి బాధితురాలి పొరుగింట్లో ఉంటున్న నితిన్గా గుర్తించారు. భోపాల్లోని కేంద్ర ప్రభుత్వ శాఖలో నితిన్ పనిచేస్తున్నాడు.
నెలరోజుల నుంచి బాధితురాలితో స్నేహం పెంచుకున్న నిందితుడు శనివారం ఉదయం ఆమె కార్యాలయానికి వెళుతుండగా బలవంతంగా తన కారులో ఎక్కించుకుని కోలార్లోని ఫాంహౌస్కు తీసుకువెళ్లి పెండ్లి చేసుకుంటానని చెబుతూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు నేరుగా అయోధ్యనగర్ పోలీస్స్టేషన్కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో నితిన్పై కేసు నమోదు చేశారు.