సేమియా: ఒక కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి: ఒక టీస్పూన్, చక్కెర: ముప్పావు కప్పు, జీడిపప్పు, కిస్మిస్: పది చొప్పున, కుంకుమ పువ్వు: చిటికెడు.
పాన్లో నెయ్యి వేడయ్యాక అందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించి తీయాలి. దాంట్లోనే సేమియా వేసి సన్నని మంటపై దోరగా వేయించి పక్కనపెట్టాలి. అదే పాన్లో రెండు కప్పుల నీళ్లుపోసి కుంకుమ పువ్వు వేడిచేయాలి. మరిగే నీళ్లలో వేయించిన సేమియా వేసి దగ్గరపడేంత వరకూ ఉడికించాలి. ఆ తర్వాత చక్కెర, యాలకుల పొడి కలపాలి. చివరగా జీడిపప్పు, కిస్మిస్ చిలకరించి దించుకుంటే.. రాఖీ స్పెషల్ సేమియా కేసరి సిద్ధం.