YS Jagan Mohan | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నై పర్యటనలో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలను కలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. చెన్నైలో జరిగిన తన సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు జగన్ హాజరుకాగా.. ఈ వేడుకలో సూర్య మరియు కార్తీ కూడా పాల్గొనడంతో వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ వివాహ వేడుకలో జగన్ ఎంతో ఆత్మీయంగా సూర్య, కార్తీలతో ముచ్చటించారు. వారందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు జగన్ను చూసేందుకు వివాహ వేడుక వద్ద అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. స్థానిక ప్రజలు కూడా ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఫిబ్రవరి 8న జరిగిన సాహిల్ – వేదికల వివాహానికి జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయ ప్రముఖులు మరియు సినిమా స్టార్లు ఒకే వేదికపై ఇలా సందడి చేయడంతో అభిమానులు ఈ వీడియోని తెగ ట్రెండ్ చేస్తున్నారు.
Jagananna & Surya Brothers In One Frame ❤️
వైయస్ జగన్ గారి పెదనాన్న జార్జి రెడ్డి గారి కుమారుడు సునీల్ రెడ్డి యొక్క తనయుడు సాహిల్ వివాహ వేడుకలో పాల్గొన్నారు..@ysjagan @Suriya_offl pic.twitter.com/WFq7eWKQ1i
— Kampasati Ashok Yadav (@ashokyadav_AKY) February 8, 2026