అగ్ర నటుడు అర్జున్ కీలక పాత్రను పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీతా పయనం’. నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ‘ఏ ఊరికెళ్తావే పిల్లా..’ అనే గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. జానపద శైలిలో సాగే ఈ గీతాన్ని చంద్రబోస్ రచించగా, అనూప్రూబెన్స్ స్వరాల్ని అందించారు. రాహుల్ సిప్లిగంజ్, మధుప్రియ ఆలపించారు.
పాటలోని సాహిత్యంతో పాటు విజువల్స్, నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓ అమ్మాయి ప్రేమ పయనంలోని అనుభూతులకు అందమైన దృశ్యరూపంలా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. సత్యరాజ్, ప్రకాష్రాజ్, కోవై సరళ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్రూబెన్స్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కథ, స్క్రీన్ప్లే, నిర్మాత, దర్శకత్వం: అర్జున్ సర్జా.