పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై అభిరుచితో కూడుకున్న విభిన్న కథా చిత్రాల్ని నిర్మిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. తాజాగా ఆయన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందించిన చిత్రం ‘ధమాకా’. రవితేజ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా శనివారం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
‘ధమాకా’ చిత్రానికి అన్ని చోట్ల భారీ ఓపెనింగ్స్ లభించాయి. ఈ కథ విన్నప్పుడే రవితేజకు బాగుంటుందనిపించింది. ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రవితేజ, శ్రీలీ ల నృత్యాలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. బీ, సీ సెంటర్లలో చక్కటి ఆదరణ లభిస్తుందని ముందే ఊహి ంచాం. మల్టీఫ్లెక్స్లలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్కు సినిమా బాగా నచ్చింది. ఓ ఫ్యాక్టరీ మోడల్లో సినిమాలు తీయాలనే లక్ష్యంతో మా సంస్థను స్థాపించాం. విభిన్నమైన కథాంశాలతో వరుస చిత్రాల్ని నిర్మించబోతున్నాం.
భారీ చిత్రాలు చేయబోతున్నాం
ప్రస్తుతం ఓటీటీలో కూడా సినిమాలు చేస్తున్నాం. ఇప్పటికీ మూడు చిత్రాల్ని రిలీజ్ చేశాం. ప్రస్తుతం మా బ్యానర్లో వరుస సినిమాలు సిద్ధమవుతున్నాయి.నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, గోపీచంద్ ‘రామబాణం’ చిత్రాలతో పాటు లావణ్య త్రిపాఠితో ఓ ప్రాజెక్ట్ ఉంది. మరికొన్ని పెద్ద చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.