విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం పుష్పక విమానం. నవంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు.
చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు.ఇక ఈ మూవీకి విజయ్ దేవరకొండ నిర్మాత కావడంతో తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ రీసెంట్గా షేర్ చేసిన వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. ఒకే బెడ్పై విజయ్ దేవరకొండ, ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ పడుకొని ఉండగా, ఉదయం బెడ్ మీద నుంచి లేస్తూనే నాతో ఈ రోజు బెడ్ షేర్ చేసుకుంది ఎవరో చూడండి అంటూ కెమెరాను ఆనంద్ వైపు తిప్పాడు విజయ్.
అంతేకాదు బెడ్ షీట్ని పలుమార్లు లాగుతూ.. ‘నీ పెళ్లాం ఎక్కడా?’ అని అడిగాడు. ఒకానొక సందర్భంలో చిరాకు వచ్చిన ఆనంద్ నా పెళ్లాం లేచిపోయిందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. ఇలా వినూత్నంగా విజయ్ ‘పుష్పక విమానం’ మూవీని ప్రమోట్ చేయడం చూసి ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక రౌడీ బాయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.