న్యూఢిల్లీ: లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా(Siddharth Mallya) ఎంగేజ్ అయ్యాడు. గర్ల్ఫ్రెండ్ జాస్మిన్ను అతను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ ఏడాది హాలోవీన్ పార్టీలో సిద్ధార్థ మాల్యా ఆమె ప్రపోజ్ చేశాడు. ఆ జంటకు అభిమానులు, మద్దతుదారులు విషెస్ చెబుతున్నారు. ఇన్స్టాలో ఎంగేజ్మెంట్ పిక్స్ను సిద్ధార్ధ పోస్టు చేశాడు. జాస్మిన్ ముందు మోకాళ్లపై కూర్చుని అతను తన ప్రేమను వ్యక్తం చేశాడు. విచ్ కాస్ట్యూమ్లో ఉన్న ఆమె ఆ ప్రపోజల్కు ఓకే చెప్పేసింది. ఒక ఫోటోలో ఆమె తన ఎంగేజ్మెంట్ రింగ్ను చూపించింది. ఇద్దరు కూడా హోలీవీన్ థీమ్లో ఉన్న దుస్తుల్ని వేసుకున్నట్లు తెలుస్తోంది.
సిద్ధార్ధ్ మాల్యా వృత్తిపరంగా నటుడు, మోడల్. అతని తండ్రి విజయ్ మాల్యా.. యూబీ గ్రూపు మాజీ చైర్మెన్. బ్యాంకులు వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం విదేశాల్లో ఉన్న విషయం తెలిసిందే. సిద్ధార్ధ మాల్యా అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో పుట్టాడు. లండన్, యూఏఈలో పెరిగాడు. లండన్లోని వెల్లింగ్టన్, క్వీన్ మేరీ వర్సిటీలో చదివాడు. రాయల్ డ్రామా స్కూల్లో యాక్టింగ్ పాఠాలు నేర్చుకున్నాడు. అనేక టీవీ షోలు, సినిమాల్లో నటించాడు.