తెలుగు సినీ నటి, కమెడియన్ విద్యుల్లేఖ రామన్ అందరికి చాలా సుపరిచితం. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈవిడ ఇప్పుడు సన్నపడింది. విద్యుల్లేఖ సన్నబడ్డటానికి కారణం ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుండడమే అనే వార్తలు కూడా వచ్చాయి. ఇరు కుటుంబాల అంగీకారంతో 2020 ఆగస్టు 26న వీరి రోకా ఫంక్షన్ జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత 2021 ఆగస్టు 26న సంజయ్ను వివాహం చేసుకుంది విద్యుల్లేఖ.
2012లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది విద్యుల్లేఖ . అదే ఏడాది నీతానే ఎన్ పోన్ వసంతం అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత రన్ రాజా రన్, సరైనోడు, రాజు గారి గది ఇలా మంచి మంచి హిట్ లను అందుకున్న ఆమె దువ్వాడ జగన్నాథం లో మాత్రం తన పాత్రతో బాగా ఆకట్టుకుంది.
ఇటీవలే తన సోషల్ మీడియా వేదికగా తన భర్త సంజయ్ తో దిగిన పెళ్లి ఫోటోలను పంచుకుంది. హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ జంట అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను కూడా షేర్ చేసింది విద్యుల్లేఖ. తాజాగా ఈ ముద్దుగుమ్మ మంచులో దిగిన ఫొటోని షేర్ చేయగా, దీనికి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇంతలా రెచ్చిపోయిందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.