వికీ కౌశల్ ఓ భారీ ప్రాజెక్ట్లో నటించబోతున్నారు. ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ పేరుతో ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య థార్ తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుందని, దీనికోసం భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నట్లు చిత్రబృందం చెబుతున్నారు. వికీ కౌశల్ సరసన సమంత నాయికగా నటిస్తున్నది. మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని సూపర్ హీరో క్యారెక్టర్ను డిజైన్ చేస్తున్నారు. ఆదిత్య థార్ మాట్లాడుతూ…‘ఈ సినిమా నా మూడేళ్ల కల. స్టోరీబోర్డ్తో సహా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేశాం. ఈ కథను ఒకేసారి చిత్రీకరించి, రెండు భాగాల సినిమాగా విడుదల చేస్తాం. ఇండియన్ స్క్రీన్పై మరో సూపర్ హీరో చిత్రంగా రూపొందిస్తాం’ అన్నారు.