హీరో వరుణ్ తేజ్, నాయిక లావణ్య త్రిపాఠీ త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరి నిశ్చితార్థం శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. చిరంజీవి, సురేఖ, అల్లు అరవింద్, పవన్ కల్యాణ్, రామ్చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. పెద్దల సమక్షంలో వరుణ్, లావణ్య ఉంగరాలు మార్చుకున్నారు. త్వరలో వీరి పెండ్లికి ముహూర్తం నిర్ణయించనున్నారు. సోషల్ మీడియాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ఎంగేజ్మెంట్ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.