ప్రస్తుతం ‘ఘని’ ‘ఎఫ్-3’ చిత్రాల్లో నటిస్తున్నారు యువ హీరో వరుణ్తేజ్. కరోనా ప్రభావంతో ఈ రెండు సినిమాల చిత్రీకరణలు వాయిదా పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మించే ఓ చిత్రంలో వరుణ్తేజ్ కథానాయకుడిగా నటించబోతున్నట్లు తెలిసంది. ఈ చిత్రానికి ‘ఛలో’ ‘భీష్మ’ చిత్రాల ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నారు. వినోదభరిత ప్రేమకథా చిత్రమిదని, స్క్రిప్ట్ బాగా నచ్చడంతో వరుణ్తేజ్ సినిమాకు వెంటనే ఓకే చెప్పారని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది సెట్స్మీదకు వెళ్లనుందని సమాచారం.