వరుణ్తేజ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ‘వరుణ్తేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.
సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఉంటుంది. వరుణ్తేజ్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అదే సమయంలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని కూడా మొదలుపెట్టాం’ అని చిత్రబృందం పేర్కొంది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు.