Varasudu Movie | కోలీవుడ్కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకుంటున్న నటుడు విజయ్ దలపతి. తుపాకి, అదిరింది, మాస్టర్ వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం విజయ్ ‘వారసుడు’ సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రం పోస్ట్ పోన్ కానున్నట్లు తెలుస్తుంది.
సంక్రాంతికి వారసుడుతో పాటు వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ కానున్నాయి. దాంతో థియేటర్లు మూడుగా పంచుకోవాల్సి ఉంటుంది. అయితే దిల్రాజు ఈ రెండు చిత్రాలను కాదని వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్లను కేటాయించాడట. నిజానికి వారసుడు ఒక డబ్బింగ్ మూవీ. ఇటీవలే షూటింగ్ బంద్ సమయంలో అన్ని సినిమాల చిత్రీకరణలు ఆగిపోతే.. వారసుడు మాత్రం షూటింగ్ జరుపుకుంది. అదేంటని అడిగితే.. దిల్రాజు అది డబ్బింగ్ సినిమా అని చెప్పాడు. దాంతో ఇప్పుడు నిర్మాత మండలి కౌన్సిల్ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ సంక్రాంతి, దసరాలకు స్ట్రేయిట్ తెలుగు సినిమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
కాగా దిల్రాజు రజనీకాంత్ ‘పేట’ రిలీజ్ టైంలో థియేటర్ల గురించి మాట్లాడుతూ సంక్రాంతికి స్ట్రేయిట్ సినిమాలుండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఎలా ఇస్తాం అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇప్పుడు దాంతో వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలున్నప్పుడు వారసుడు సినిమాకు థియేటర్లు ఎలా ఇస్తారు అంటూ పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన వారసుడు సినిమాలో విజయ్కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే రిలీజైన రంజితమే సాంగ్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు.