Actress Vanitha Vijayakumar | ఇరవైనాలుగేళ్ల క్రితం వచ్చిన దేవి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది వనితా విజయ్కుమార్. ఈమె సీనియర్ నటుడు విజయ్కుమార్ కూతురు. కెరీర్ బిగెనింగ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడిపిన వనితా.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కాగా మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పెళ్లి సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. నరేష్-పవిత్రలోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎమ్.ఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా శుక్రవారం రిలీజై మంచి టాక్తో దూసుకుపోతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా వనితా విజయ్ కుమార్ ఈ సినిమా ప్రమోషన్లో తన పర్సనల్ విషయాలను పంచుకుంది.
ఒకానొక సమయంలో కుటుంబసభ్యులే బెదిరించారని, ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని వనితా విజయ్కుమార్ సంచలన విషయాలను చెప్పింది. గతంలో తాను ఆస్తి తగాదాలను ఎదుర్కొన్నట్లు, అప్పుడు సొంత వాళ్లే తనను కాదని, ఇంట్లో నుంచి పంపించేశారని వనిత చెప్పుకొచ్చింది. అప్పుడు ఎక్కడికి వెళ్లాలలో అర్థం కాలేదని.. ఆ సమయంలో పిల్లలను తీసుకుని కర్ణాటకకు వెళ్లిపోయి అక్కడే రెండేళ్ల పాటు ఉన్ననని చెప్పింది. ఆ టైమ్లో వాళ్ల నాన్నకు ఫోన్ చేస్తే తమిళనాడులో నువ్వు కాలు కూడా పెట్టలేవు. ఒక్క సారి వచ్చి చూడు అంటూ ఛాలెంజ్ చేశారని తెలిపింది. కానీ, ఇప్పుడు తమిళనాడులు తనను అందరూ ఇంటి బిడ్డలా భావిస్తున్నారని చెప్పుకొచ్చింది.