సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో వంశీ ప్రమోద్, జాన్వేల్ రాజా, విక్రమ్లు నిర్మిస్తున్న నూతన చిత్రం ఇటీవల ప్రారంభమైంది.స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. విలక్షణమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో మాస్ కమర్షియల్ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలు మేళివించి ఓ యూనివర్శల్ పాయింట్తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.