ఓ కథను వర్ణించడంలో దర్శకుడి ప్రతిభకౌశలాలు, పాత్రల్ని కళ్లముందుంచే సృజనాత్మకత సినిమాల ఎంపికలో కీలకమవుతాయని చెప్పింది కథానాయిక వాణీ కపూర్. ‘షంషేరా’ చిత్రంలో ఆమె రణబీర్కపూర్ సరనస నటించింది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. కరణ్మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చెప్పినప్పుడు దర్శకుడి నరేటివ్ స్కిల్స్ తనను అబ్బురపరిచాయని, అప్పుడే సినిమా విజయం ఖాయమనుకున్నానని వాణీకపూర్ ప్రశంసించింది.
ఆమె మాట్లాడుతూ ‘కథ చెబుతున్నప్పుడు దర్శకుడు కరణ్ మల్హోత్రా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో కూడా వినిపించేవారు. పాత్రల తాలూకు ఎమోషన్స్ను కళ్లముందుంచాడు. స్టోరీ నరేషన్లోనే సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. అంత గొప్పగా కథను వివరించాడు కాబట్టే నా పాత్రతో వెంటనే కనెక్ట్ అయిపోయా. ఎలాంటి హోమ్వర్క్ లేకుండానే సెట్స్లోకి వెళ్లిపోయా. ‘షంషేరా’ చిత్రం నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’అని పేర్కొంది. నటిగా ప్రతి సినిమాకు పరిణితి చెందుతున్నానని, భవిష్యత్తులో మహిళా ప్రధాన చిత్రాలు చేయాలనే లక్ష్యంతో కెరీర్ను తీర్చిదిద్దుకుంటున్నానని వాణీకపూర్ చెప్పింది.