Trivikram Son | ఇండస్ట్రీ ఏదైనా వారసులు రావడం అనేది సర్వ సాధారణం. హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా సినిమా ఇండస్ట్రీలో రాణించినవారు వాళ్లలాగే వాళ్ల పిల్లలు కూడా రాణించాలని సినీరంగం వైపు అడుగులు వేయిస్తుంటారు. ఇక దాదాపుగా వారసులు నటులుగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. మిగితా ఏ క్రాఫ్ట్లోనూ వారసుల పిల్లలు కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కొడుకు కూడా తండ్రి బాటలోనే దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. ఈ మధ్యనే త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య తన కొడుకు రిషీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది.
రిషీకు దర్శకత్వం అంటే ఇంట్రెస్ట్ ఉందని, ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్పై శిక్షణ తీసుకుంటున్నాడని వెల్లడించింది. ఇక త్రివిక్రమ్ ఫ్యామిలీ గురించి ఇండస్ట్రీ వాళ్లకు తప్ప బయట జనాలకు పెద్దగా తెలియదు. అసలు ఎప్పుడూ మీడియా ముందుకు రాని సాయి సౌజన్య.. ఇప్పుడు నిర్మాతగా మారి తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి బయటకు వస్తు్ంది. ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా తన కొడుకు గురించి చెప్పుకొచ్చింది. ఇక రిషీ మనోజ్ గురించి కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయన ఫోటోలు కూడా ఎప్పుడు బయటకి రాలేదు.
సోషల్ మీడియా అకౌంట్స్లు కూడా ప్రైవేట్ మోడ్లో ఉంటాయి. కాగా తాజాగా రిషి మనోజ్కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తున్నాడు. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య, కొడుకు రిషీ మనోజ్తో దిగిన ఫోటోను సిరివెన్నెల సీతారామశాస్త్రీ కొడుకు, నటుడు రాజా తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ఇక నటుడు రాజా.. త్రివిక్రమ్ భార్యకు తమ్ముడు అవుతాడు.