Yash | ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ చేస్తున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). యాశ్ 19గా తెరకెక్కనున్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీన్ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మొదట ఈ మూవీలో యశ్కు జోడీగా సాయిపల్లవి నటించనున్నట్లు టాక్ నడిచింది. ఆ తర్వాత ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి కరీనాకపూర్ (Kareena kapoor) ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న కరీనా తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. బాలీవుడ్ భామలు టబు, కరీనా కపూర్ ఖాన్ కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రూ’. . ఈ సినిమా మార్చి 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా కరీనా మాట్లాడుతూ.. నేను త్వరలో ఓ భారీ ప్రాజెక్టుతో దక్షిణాది చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నా. అది పాన్ ఇండియా ప్రాజెక్టు. నేను ఎక్కడ షూటింగ్ చేస్తానో నాకు ఇంకా తెలియదు. మొదటిసారి ఇలాంటి సినిమాలో పనిచేస్తున్నాను’ అని చెప్పుకోచ్చారు. దీంతో కరీనా నటించేది యష్ మూవీనే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.