Tollywood | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించినా, ఆ హైప్ బాక్సాఫీస్ వద్ద కనబడకపోవడంతో సినిమా రన్ దారుణంగా పడిపోయింది. కథ, భావోద్వేగాలు, ఫీల్-గుడ్ ట్రీట్మెంట్ విషయంలో ప్రేక్షకులు మెచ్చుకున్నప్పటికీ, ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం సినిమా మొదటి మూడు రోజుల్లో కూడా రూ. 10 కోట్ల షేర్ మార్క్ను టచ్ చేయలేకపోవడం గమనార్హం. దీని కారణం రామ్కు వచ్చిన వరుస ఫ్లాప్ల ప్రభావమా? లేక ఫ్యామిలీ–డ్రామా జానర్పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఫ్యామిలీ డ్రామాలు ఓవర్సీస్లో బాగా ఆడతాయి. రామ్ కెరీర్లో మొదటిసారి నార్త్ అమెరికాలో 1 మిలియన్ గ్రాస్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశించినా, అక్కడ కూడా సినిమా పికప్ కాలేదు. బ్రేక్ ఈవెన్ చేరాలంటే మొత్తం రూ.23 కోట్ల షేర్ అవసరం , కానీ ప్రస్తుత రన్ చూస్తే అది అసాధ్యమని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఈ పరిణామాల నడుమ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వైరల్ అయింది. “సినిమా బాగుంది అన్నారు… కానీ కలెక్షన్లు రావడం లేదు. టాలీవుడ్ ఫెయిల్ అయింది” అన్న భావంతో వైరల్ అవుతున్న ట్వీట్ను చాలామంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చేసిందేనని భావించారు.
దీంతో నెట్టింట చర్చ వేడెక్కింది . అయితే కొంతసేపటికే ఆ అకౌంట్ నకిలీదని తేలడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. ఒక్కసారిగా చూసి నిజం అనుకున్నాం ,సినిమా బాగుందని మనమే చెప్పి థియేటర్లకు వెళ్లకపోవడం ఏంటి అంటూ కామెంట్లు వచ్చాయి. పాజిటివ్ టాక్ ఉన్నా కలెక్షన్లు రాకపోవడంతో నెట్లో ‘ప్రేక్షకులు vs బాక్సాఫీస్’ అనే కొత్త డిబేట్ మొదలైంది. థియేటర్లలో చూడాల్సిన సినిమాలను ఓటీటీ కోసం వేచి చూస్తూ మనమే సినిమాలను ఫెయిల్ చేస్తున్నాం., టాలీవుడ్ ఫెయిల్ అవుతుండడం కాదు, ప్రేక్షకులే ఫెయిల్ అవుతున్నారు అని అంటున్నారు. మొత్తానికి రామ్ చిత్రం మంచి టాక్ సంపాదించినా, ఆ ఎనర్జీ బాక్సాఫీస్కి చేరకపోవడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.