Thudarum On Jio Hotstar | మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘తుడరుమ్స తాజాగా ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ సినిమా మే 30, 2025 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన జియో సినిమాలో తెలుగుతో పాటు తమిళం, హింద, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండానే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.
ఈ ఏడాది మార్చి 27న ఎంపురాన్ అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న మోహన్ లాల్ ఈ సినిమా తర్వాత నెల రోజులు కూడా గ్యాప్ తీసుకోకుండానే తుడరుమ్ని విడుదల చేశాడు. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రావడంతో జనాలు థియేటర్లకి క్యూ కట్టారు. విడుదలైన మొదటిరోజు నుంచే హౌజ్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోయిన ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లను రాబట్టడమే కాకుండా కేరళ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. ‘తుడరుమ్’ చిత్రానికి థరుణ్ మూర్తి దర్శకత్వం వహించగా.. ఈ సినిమాలో మోహన్లాల్ సరసన శోభన నటించింది. ప్రకాష్ వర్మ, బిను పప్పు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
ജിയോഹോട്ട്സ്റ്റാറിൽ തുടരും!
Thudarum will be streaming from 30 May only on JioHotstar.@mohanlal @shobana_actor @Rejaputhra_VM @talk2tharun#Thudarum #JioHotstar #JioHotstarMalayalam #ThudarumOnJioHotstar #Mohanlal #Shobhana #MalayalamCinema #Mollywood #ThudarumMovie… pic.twitter.com/9DPjB8zio3
— JioHotstar Malayalam (@JioHotstarMal) May 26, 2025