తిరువీర్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్నది. ద్రిష్టి తల్వార్ కథానాయిక. రాజ్ విరాట్ దర్శకుడు. సాయిమహేశ్ చందు, సాయి శశాంక్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ మొదలుకానున్న ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ని మేకర్స్ శనివారం విడుదల చేశారు. డార్క్ కామెడీ జానర్లో ఆద్యంతం నవ్వించే కథా, కథనాలతో స్క్రిప్ట్ తయారైందని, త్వరలో టైటిల్ని ఖరారు చేసి, మిగతా వివరాలు తెలియజేస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహించనున్న ఈ చిత్రానికి కెమెరా సుజాత సిద్ధార్థ్.