భారతీయ పురాణ ఇతిహాసం రామాయణం వెండితెరపై నిత్యనూతనంగా సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. ఇప్పటికే పలు భారతీయ భాషల్లో అనేకమార్లు రామాయణ మహాకావ్యాన్ని తెరకెక్కించారు. ఈ పరంపరలో మరో భారీ పాన్ ఇండియా చిత్రం రాబోతున్నది. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన భారీ వ్యయంతో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తారు. రాముడిగా రణబీర్కపూర్, సీతగా సాయిపల్లవి నటించనున్నారు.
రావణాసురుడి పాత్రలో కన్నడ అగ్ర హీరో యష్ నటిస్తారని వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఓ తాజా అప్డేట్ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నారని తెలిసింది. రామాయణ ఇతిహాసంలోని అన్ని ప్రధాన ఘట్టాలను ఈ మూడు భాగాల్లో చూపించేలా ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్తుందని సమాచారం.