జనవరి 13న నెట్ఫ్లిక్స్లో విడుదలైన వెబ్ సిరీస్ ‘కిల్లర్ సూప్’. ఇందులో మనోజ్ బాజ్పేయి, కొంకణ సేన్ శర్మ నటించారు. 2017లో తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాలో కలకలం రేపిన ఓ హత్యోదంతాన్ని ఆధారంగా చేసుకొని తెరెక్కించిన సిరీస్ ఇది. ‘ఉడ్తా పంజాబ్’ ఫేమ్ అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ పూర్తి యధార్థ ఘటనను కాకుండా పాక్షిక సమాచారాన్ని తీసుకొని తెరకెక్కించినట్టు మేకర్స్ వెల్లడించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యాపారిని ఆయన భార్య ప్రియుడితో కలిసి హత్య చేయడం, తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ప్రియుడి ముఖాన్ని భర్త ముఖంలా మార్చి తప్పించుకోవాలని చూడడం వంటి అంశాలను తెరకెక్కించారు. శాఖాహారి అయిన యువతి ప్రియుడు ఆసుపత్రిలో మటన్ తినడానికి నిరాకరించడంతో ఈ హత్యోదంతం వెలుగు చూసింది. ఈ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కించారు.