నందితా శ్వేత, రామ్ జంటగా రూపొందుతున్న ‘ఓటీపీ’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. కళ్యాణ్కుమార్ దర్శకత్వంలో యన్.గురు ప్రసాద్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత కూతురు బేబీ జీవాన్సిరెడ్డి కెమెరా స్విఛాన్ చేయగా, ఇండియన్ ఐడల్ ఫేం శ్రీరామచంద్ర క్లాప్ నిచ్చారు.
కమెడియన్ అలీ స్క్రిప్ట్ను అందించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందుతున్న వైవిధ్యభరితమైన చిత్రం ఇది. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’ అన్నారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసి తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.