స్టార్ హీరో సూర్య నటిస్తున్న 42వ సినిమా మోషన్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రం 10 భాషల్లో త్రీడీ ఫార్మేట్లో విడుదల కానుంది. కేఈ జ్ఞానవేల్ రాజా సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. శివ దర్శకుడు. గతేడాది 8వ తేదీన ప్రారంభమైన ఈ సినిమా అదే రోజు రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లింది.
భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దిశా పటానీ నాయికగా నటిస్తున్నది. మోషన్ పోస్టర్ యుద్ధ భూమిలో మహావీరుడిగా సూర్యను చూపించింది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. యోగిబాబు, రెడిన్ కింగ్ల్సే, కోవై సరళ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.