Rajinikanth | ‘జైలర్’గా బాక్సాఫీస్ దుమ్ము దులిపిన రజనీకాంత్ హీరోగా ఓ అడ్వంచరస్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. లోకేశ్ కనకరాజ్ దర్శకుడు. సన్ పిక్చర్స్వారు నిర్మాతలు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇది తలైవా 171వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ని ఇటీవలే మేకర్స్ విడుదల చేశారు. లోకేష్ కనకరాజ్ ఈ సినిమా కథ గురించి చెబుతూ.. ఇదొక ప్రయోగాత్మక చిత్రమని, ఇందులో తలైవా పాత్ర మనుపెన్నడూ చూడని విధంగా కాస్త నెగిటీవ్ షేడ్స్తో ఉంటుందని, పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తన గత చిత్రాల మాదిరిగా మాదకద్రవ్యాల ప్రస్తావన ఉండదని అన్నారు.
అయితే.. చెన్నయ్ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో రజనీకాంత్ అనేక దేశాలకు బంగారం స్మగ్లింగ్ చేసే డాన్గా కనిపిస్తారని తెలుస్తున్నది. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలోనే కథ, కథనాలు నడుస్తాయట. లోకేష్ కనకరాజ్ మార్క్ ఇంట్రస్టింగ్ డీలింగ్స్ ఈ కథలో కనిపిస్తాయని వినికిడి. రీసెంట్గా విడుదల చేసిన రజనీ ఫస్ట్లుక్ పోస్టర్లో కూడా బంగారంతో చేసిన రిస్ట్ వాచ్ కనిపిస్తున్నది. బంగారానికీ, సమయానికీ ఈ కథకూ సంబంధం ఉంటుందని ఆ పోస్టర్ చెప్పకనే చెబుతున్నది. ఇంకా ఈ సినిమాకు చెందిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.