Bigg Boss Telugu 8 | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరేట్ షో బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 13 వారాలుగా అలరిస్తున్న ఈ షో మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ షోకి సంబంధించి ఆదివారం వస్తుందంటే చాలు ప్రేక్షకులు టెన్షన్తో టీవీలకు అతుక్కుపోతారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హౌజ్ నుంచి బేబక్కతో పాటు, శేఖర్ బాషా, అభయ్, సోనియా ఆకుల, గంగవ్వ, హరితేజ, నవీన్ తదితరులు ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ప్రస్తుతం హౌజ్లో 9 మంది మిగిలారు. అందులో ఈ వారం నామినేషన్స్ లో 8 మంది ఉండగా.. ఎలిమినేషన్స్ షాకింగ్ ట్వీస్ట్ చోటు చేసుకుంది. ఎవరు ఊహించని విధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో శనివారం నాడు హౌజ్ నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టిన తేజ.. ఈ వారం నామినేషన్స్లో ఉండగా.. తక్కుడ ఓటింగ్తో డేంజర్ జోన్లో ఉన్నాడు. దీంతో తక్కువ ఓటింగ్ ఉన్న తేజ హౌజ్ నుంచి బయటకు వచ్చేశాడు. మరోవైపు ఈరోజు పృథ్వి ఎలిమినేట్ అవ్వనున్నట్లు సమాచారం.
అయితే హౌజ్ నుంచి బయటకు వెళ్లిన టెస్టీ తేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ సీజన్లో అక్టోబర్ 6 న వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన టేస్టీ తేజ. దాదాపు 8 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు. దీంతో అతడికి వారానికి రూ. 4 లక్షల చొప్పున రెండు నెలల్లో రూ.30 లక్షల పారితోషికం బిగ్ బాస్ నిర్వహాకులు ఇచ్చినట్లు తెలుస్తుంది.