విజయ్కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రధారులుగా రూపొందిన పొయెటిక్ ప్రేమకథ ‘కాలమేగా కరిగింది.’. సింగార మోహన్ దర్శకుడు. మరే శివశంకర్ నిర్మాత. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని పాటను బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ‘తను జతగా లేని కథలో.. ఈ ఒంటరి పరుగెక్కడికో.. తను నేరుగా తాకే సడిలో.. ఈ తుంటరి స్మృతిలెక్కడివో..’ అంటూ సాగే ఈ పాటను శరత్చంద్ర తిరునగరి రాయగా, గుడప్పన్ స్వరపరిచారు. కృష్ణ తేజస్వి ఆలపించారు. యువతరం మెచ్చే ప్రేమకథ ఇదని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వినీత్ పబ్బతి, నిర్మాణం: సింగార క్రియేషన్స్ వర్క్స్.