స్టార్డమ్ను ఆశించి తాను సినిమాల్లో అడుగుపెట్టలేదని అంటోంది మిల్కీబ్యూటీ తమన్నా. పేరుప్రఖ్యాతులు కోల్పోతానని తానెప్పుడూ భయపడలేదని స్పష్టం చేసింది. కొంతకాలంగా దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తోంది తమన్నా. వెబ్సిరీస్లు, రియాలిటీ షో ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ప్రతిభను చాటుకుంటోంది. అగ్రనాయిక అనే ఇమేజ్కు దూరమవుతాననే భయం తనలో లేదు కాబట్టే పాత్రల పరంగా ప్రయోగాలు చేస్తున్నానని చెప్పింది. తమన్నా మాట్లాడుతూ ‘పదిహేనేళ్ల వయసులో నా నటజీవితం ఆరంభమైంది. కెమెరా ముందు నటించే అవకాశం వస్తే చాలనుకున్నా. ఏదీ ఆశించకుండా నిజాయితీగా శ్రమించాలని నిర్ణయించుకున్నా. డబ్బు సంపాదించాలని, పెద్ద స్టార్నవ్వాలని ఏ రోజు కోరుకోలేదు. వాటి గురించి మాత్రమే ఆలోచిస్తే నేను ఇన్నేళ్లు ఇండస్ట్రీలో రాణించేదాన్ని కాదు. గొప్ప పేరును సంపాదించడం కంటే ప్రతి రోజు సెట్స్లో ఉండటమే ఓ వరంగా భావిస్తా’ అని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో తమన్నా ‘ఎఫ్-3’, ‘సీటీమార్’, ‘మాస్ట్రో’, ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.