మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకి, ఫ్యామిలీకి ఎంతో గర్వకారణం. ఆయనతో ఫొటో దిగడం చాలా అదృష్టంగా భావిస్తుంటారు. కుటుంబ సభ్యులు కూడా చిరంజీవితో దిగిన పిక్స్ తరచు షేర్ చేస్తూ ఫ్యాన్స్ని అలరిస్తుంటారు.తాజాగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తన సోషల్ మీడియాలో తండ్రి చిరంజీవి,తల్లి సురేఖతో కలిసి దిగిన క్యూట్ పిక్ షేర్ చేసింది. ఈ పిక్కి సర్ప్రైజింగ్ కామెంట్ పెట్టింది.
నా పేరెంట్స్తో బయటకు వెళ్లినప్పుడు ఆరేళ్ల బేబి ఫీల్ కలుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం సుస్మిత చేసిన పోస్ట్ వైరల్గా మారింది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత గతంలో చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’తో పాటు ‘సైరా నరసింహారెడ్డి’తో పాటు పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ మధ్య సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఓ వెబ్ సిరీస్ను నిర్మించింది.
ఇటీవల సినిమాలలోకి కూడా ఎంట్రీ ఇవ్వగా, ప్రస్తుతం ‘శ్రీదేవి శోభన్ బాబు’ పేరుతో ఓ సినిమాను నిర్మించింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసారు. ఇందులో ‘ఏక్ మినీ కథ’ సినిమాతో హీరోగా పరిచయమైన సంతోష్ శోభన్ హీరోగా నటించారు. హీరోయిన్గా జాను ఫేమ్ గౌరీ కిషన్ హీరోయిన్గా నటించింది. క్యాచీ టైటిల్ ‘శ్రీదేవి శోభన్ బాబు’ చిత్రంతో నిర్మాత సుస్మిత కొణిదెల సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.