అక్కినేని నాగ చైతన్య- సమంత జంటని చూసి ఈ జంట చాలా చూడముచ్చటగా ఉందని ఎందరో కామెంట్స్ చేశారు. ఆన్స్క్రీన్, ఆఫ్ స్క్రీన్లోను వారి పెయిర్ చాలా బాగుంటుంది. ఏ మాయ చేశావే సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా, దాదాపు ఏడేళ్లపాటు కొనసాగింది. చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో 2017లో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు.
అక్టోబర్ 6,7 తేదీలలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగగా, అప్పట్లో వీరి పెళ్లి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు అనుకున్న సమయంలో అక్టోబర్ 2 మధ్యాహ్నాం తాము డైవర్స్ తీసుకోబోతున్నట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.
దీనిపై నాగార్జున కూడా రియాక్ట్ అవుతూ.. ”బరువెక్కిన గుండెతో ఈ విషయం మీతో చెబుతున్నా. ఇలా జరగడం చాలా దురదృష్టకరం. భార్యభర్తలైన చై- సామ్ మధ్య జరిగింది పర్సనల్. ఆ ఇద్దరూ నాకు ఎంతో ప్రియమైన వారు. నేను, నా ఫ్యామిలీతో కలిసి సమంతతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారిద్దరికి బలం చేకూర్చాలని ఆ దేవుడిని కోరుతున్నాను” అంటూ పోస్ట్ పెట్టారు.ఇదే పోస్ట్ పంచుకున్న సురేఖావాణి.. నాగ చైతన్య- సమంత విడిపోతున్నారనే వార్త తెలిసి గుండె పగిలిందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా జరగకుండా ఉండాల్సింది అని బాధాతప్త హృదయంతో పేర్కొంది.