స్టార్ హీరో మహేష్ బాబు సోషల్ మీడియాలో మరో మైలురాయిని చేరుకున్నారు. ట్విట్టర్లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 13 మిలియన్లకు చేరింది. దక్షిణాది తారల్లో మరెవరికీ ఇంతమంది ఫాలోవర్స్ లేరు. ఈ ఫీట్ సాధించిన తొలి సౌత్ హీరోగా మహేష్ ఖ్యాతికెక్కారు. మహేష్ బాబు తర్వాత స్థానాల్లో కోలీవుడ్ హీరోలు ధనుష్, సూర్య, కమల్హాసన్ తదితరులు ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఈ స్టార్ హీరో తన కొత్త సినిమా సంగతులను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అలాగే కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లిన పిక్స్ కూడా షేర్ చేస్తుంటారు. ఇవన్నీ నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఆయన చేస్తున్న అనేక ఎండార్స్మెంట్స్ కూడా ఫాలోవర్స్ పెరిగేందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన తన 28వ సినిమాలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. దసరా ముందు ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమా విడుదల కానుంది.