Sumanth | ఈ మధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి సంబంధించి వస్తున్న వార్తలలో నిజాలు ఉండడం లేదు. కొందరు కావాలని గాసిప్ క్రియేట్ చేసి అభిమానులని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ మధ్య హీరోయిన్ మృణాల్ ఠాకూర్తో సుమంత్ చాలా క్లోజ్గా ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అయింది. దీంతో వారిద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై సుమంత్ గానీ, మృణాల్ కాని వారి సన్నిహితులు గానీ స్పందించకపోవడంతో రూమర్లు మరింత పెరిగాయి. అయితే తాజాగా దీనిపై సుమంత్ క్లారిటీ ఇచ్చేశాడు. కొద్దిరోజులుగా జరుగుతోన్న ప్రచారం అంతా ఫేక్ అంటూ కొట్టి పారేశాడు. ఆ ఫోటో సీతారామం మూవీ అప్పటిదని , దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ పెళ్లి అంటూ పుకార్లు పుట్టిస్తున్నారని అన్నారు.
సీతారామం తర్వాత ఇద్దరం కలుసుకున్నదీ లేదని కూడా సుమంత్ స్పష్టం చేశారు. ఇక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఏ మాత్రం లేదని కూడా తేల్చి చెప్పారు. ఇలా ఉండటమే తనకు ఇష్టమని అన్నారు. రొటీన్ లైఫ్ అస్సలు బోర్ కొట్టదని, రోజు ఐదు గంటలు సినిమాలు లేదా ఓటీటీలో బిజీగా ఉంటానని, ఆ తర్వాత జిమ్ చేయడంతో పాటు స్పోర్ట్స్ ఆడతానంటూ తెలియజేశాడు సుమంత్. దాని వలన పెళ్లి అనే ఆలోచన ఏ మాత్రం రాదని పేర్కొన్నారు. సుమంత్ ఇచ్చిన క్లారిటీ చూస్తే.. ఇక లైఫ్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదన్నట్లుగా కనిపిస్తుంది. సుమంత్కు గతంలోనే వివాహం కాగా, ఆ తర్వాత పలు కారణాల వలన విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుండి సుమంత్ సోలోగానే ఉంటున్నారు.
ఇక సుమంత్ నటించిన అనగనగా చిత్రం ఓటీటీలో మే 15న స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న సుమంత్ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడే సుమంత్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథ’ సినిమాతో హీరోగా తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆయన సత్యం, గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్ళీ రావా వంటి క్లాసిక్స్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఈ మధ్య సుమంత్ చేస్తున్న చిత్రాలు పెద్దగా హిట్ కావడం లేదు. సుమంత్ హీరోగా నటించిన ‘అనగనగా’ మూవీ మే 8న ఓటీటీలో నేరుగా రిలీజ్ కావాల్సి ఉండగా… మే 15కి వాయిదా పడింది.