వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ కెరీర్ను కొనసాగిస్తున్న యువహీరో సుధీర్బాబు తన తాజా చిత్రాన్ని ప్రకటించారు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎస్సి పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ‘దైవికమైన అంశాలతో కూడిన పీరియాడిక్ చిత్రమిది. 1989 కుప్పంలో కథ జరుగుతుంది. నేటివిటీని ప్రతిబింబించే చిత్రమిది. సుధీర్బాబు మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపిస్తారు. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.