Sriya Reddy | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ భామల్లో ఒకరు శ్రియారెడ్డి (Sriya Reddy). ఈ చెన్నై భామ గతేడాది సలార్ పార్టు 1 (Salaar)తో థియేటర్లలో సందడి చేసిందని తెలిసిందే. సలార్లో శ్రియా రెడ్డి పోషించిన రాధా రమా మన్నార్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సీక్వెల్ సలార్ 2తో బిజీ అయ్యేందుకు రెడీ అవుతోంది. కాగా ఈ బ్యూటీ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్కు ఓ చెడ్డ అలవాటు ఉందని చెప్పి హాట్ కామెంట్స్ చేసింది. దీంతో కంగుతిన్న అభిమానులు, మూవీ లవర్స్ ఇంతకీ ఏమిటై ఉంటుందని తెగ చర్చించుకోవడం మొదలు పెట్టారు.
కాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో శ్రియా రెడ్డి మాట్లాడుతూ.. పెద్ద సినిమాలో భాగమైతే కొంతమంది నటీనటులు సంతృప్తి చెందుతారు. నటీనటులు సంబంధిత ప్రశ్నలు అడిగినప్పుడే మీకు తేడా కనిపిస్తుంది. నేను సెట్స్పైలోకి వెళ్లేటప్పుడు ఏమి మాట్లాడబోతున్నానో తెలుసుకోవాలి. ప్రశాంత్ నీల్కు సెట్స్లో డైలాగ్స్ రాసే అలవాటు చాలా చెత్తగా ఉంది (నవ్వుతూ). అతను సెట్స్లో అలా చేసిన ప్రతిసారీ నేనతడిని హత్య చేయాలనుకున్నా. కానీ నేను సొంతంగా డైలాగులు నేర్చుకోవడానికి సమయాన్ని తీసుకుంటాను. ప్రాంప్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. మీరు ఆ పాత్రగా ఉండిపోవాలని నేను భావిస్తున్నా. నటుడు పాత్ర లోతుల్లోకి వెళ్లినప్పుడే ఆ ప్రభావం బలంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.
పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న ఓజీ (OG)లో కీలక పాత్రలో నటిస్తుంది శ్రియా రెడ్డి. చాలా కాలం తర్వాత సలార్తో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చిన శ్రియా రెడ్డి మరి రానున్న రోజుల్లో ఎలాంటి సినిమాల్లో కనిపిస్తుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు.