కరోనా సెకండ్ వేవ్ వలన థియేటర్స్ అన్ని మూతపడ్డ సంగతి తెలిసిందే. జూలై 30 నుండి థియేటర్స్ తిరిగి తెరచుకోగా, చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. విశ్వక్ సేన్ పాగల్ ఆగస్ట్ 14న విడుదల కానుండడంతో ఈ మూవీపై అభిమానుల ఆసక్తి నెలకొంది. ఇక శ్రీముఖి నటించిన క్రేజీ అంకుట్స్ చిత్రం ఆగస్ట్ 19న రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలపై ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి.
ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన ”శ్రీదేవి సోడా సెంటర్” సినిమా విడుదల తేదీని కూడా ఫిక్స్ చేశారు. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాన్ని ఆగస్టు 27న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా,శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
టైటిల్తో పాటు పలు ప్రచార చిత్రాల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన మేకర్స్ శ్రీదేవి సోడా సెంటర్ ద్వారా బాక్సాఫీస్ షేక్ చేస్తామంటున్నారు. ఇందులో సుధీర్ సరసన తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. లైటింగ్ సూరిబాబుగా సుధీర్ బాబు, సోడాల శ్రీదేవిగా ఆనంది కనిపించనున్నారు. పావెల్ నవగీతన్ , నరేష్ , సత్యం రాజేష్ , రఘుబాబు, అజయ్ ,హర్షవర్ధన్ ,సప్తగిరి , రోహిణి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సంగీత బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మరి గత ఏడాది వి చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసి చేతులు కాల్చుకున్న సుధీర్ బాబు ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి.