సంపూర్ణేష్బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతిగుప్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకుడు. ఈ సినిమాలోని ‘అన్నంటే దోస్తే సోదరా’ అనే పాటను శనివారం హీరో మంచు మనోజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..సంపూర్ణేష్బాబు నవ్వు ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంటుందని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
సంపూర్ణేష్బాబు మాట్లాడుతూ “కరెంట్ తీగ’ సినిమా చేస్తున్నప్పటి నుంచి మంచు మనోజ్తో అనుబంధం కొనసాగుతున్నది. ఆయన్ని నా సొంత అన్నలా భావిస్తా’ అని చెప్పారు. సుద్దాల అశోక్తేజ రాసిన ఈ గీతం అన్నాదమ్ముల అనుబంధానికి అద్దం పడుతుందని దర్శకుడు మన్మోహన్ మేనంపల్లి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జాన్, సంగీతం: సునీల్కశ్యప్, నిర్మాత: చంద్ర చగంలా, కథ-దర్శకత్వం: మన్మోహన్ మేనంపల్లి.