స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి తప్పక సమయం కేటాయిస్తూ ఉంటాడు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితమైన బన్నీ పిల్లలతో తెగ ఎంజాయ్ చేశాడు. ఇక కొద్ది రోజులుగా పుష్ప షూటింగ్తో బిజీగాఉన్న అల్లు అర్జున్ రీసెంట్గా తన ఫ్యామిలీని తీసుకొని మాల్దీవులకి వెళ్లాడు. అర్హ, ఆయాన్, బన్నీ స్విమ్మింగ్ ఫూల్లో సరదాగా ఈత కొడుతున్న వీడియోను స్నేహా తన ఇన్స్టాగ్రామ్లో.. ‘ఫ్యామిలీ వెకేషన్’ అంటూ షేర్ చేసింది. ఇది నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇందులో తొలిభాగం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. డిసెంబర్ 17న ఈ మొదటి భాగాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కొద్ది రోజులుగా జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతుండగా,ఈ రోజు శ్రీ వల్లి సాంగ్ విడుదల కానుంది.
https://www.instagram.com/reel/CU7GNu8FICX/?utm_source=ig_web_copy_link