కవి,గేయ రచయిత కందికొండ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పని చేశారు. బతుకమ్మ పాటను బాహ్య ప్రపంచంలోకి తీసుకెళ్లిన రచయితల్లో ఆయన కూడా ఒకరు. మల్లికూయవే గువ్వా.. అనే పాటతో కందికొండ సినీ ప్రయాణం మొదలైంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి ఇలా పూరి జగన్నాథ్ సినిమాలకు ఎన్నోన్నో సూపర్ హిట్ సాంగ్స్ రాశారు.
రచయితగా ఎన్నో విజయవంతమైన పాటలు రాసిన కందికొండ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.ఆయనకి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు.ఇప్పటికే కోన వెంకట్ లక్ష రూపాయలు చేయగా, తాజాగా ప్రముఖ సింగర్ స్మిత కందికొండ శస్త్ర చికిత్స కోసం కొంత సాయం చేసినట్టు తెలుస్తుంది.
“ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు, ఇడియట్, చిరుత, టెంపర్ వంటి పలు సినిమాలకు పాటలు రాసిన ప్రముఖ గేయ రచయిత కందికొండ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఎన్నో పాటలు, ఎన్నో మెలోడీ, మాస్ సాంగ్స్ని అందించారు.